ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్కు అందజేస్తాం - జాన్ సైదా
చిలకలూరిపేట:- పట్టణంలోని టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ జాన్ సైదా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కుట్టుమిషన్ సృష్టికర్త అయిన స్త్రీ ఇలియన్స్ హోవే గారి చిత్రపటానికి పూలమల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాన్ సైదా మాట్లాడుతూ ప్రతినెల 20 వేల రూపాయలు టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు అందిస్తానని హామీ ఇచ్చారు. టైలర్స్ అసోసియేషన్క తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం టైలర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి జాన్ సైదా గారిని పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు , పోతవరం సర్పంచ్ భాషా మేస్త్రి, కరీముల్లా, ఆది బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment