బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాసి నందిత సికింద్రాబాద్ నుండి బాసరకు వెళ్తున్న సమయంలో పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై డివైడర్ను ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా చర్లపల్లి వద్ద కారు అదుపుతప్పి హోం గార్డెన్ ఢీకొనడంతో అతను అక్కడక్కడ మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు పది రోజుల సమయంలో ఈ యాక్సిడెంట్ లో చనిపోవడంతో నియోజకవర్గం ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి 19 న లాస్య తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. లాస్య మృతి పట్ల పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.