తమిళనాడు గడిచిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో DMK (స్టాలిన్) 234 స్థానాలకు గాను 159 స్థానాలు గెలిచి విజయకేతనం ఎగురవేశారు. అయితే గెలిచిన ఆనందంలో పార్టీ కార్యకర్తలు చెన్నై లోని AIDMK పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్పాటు చేసిన అమ్మ కాంటీన్ల పైన దాడి చేసి జయలలిత ఫోటోలను చించివేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ అలాంటి చర్యలకు పాల్పడిన సొంత పార్టీవాళ్ల పైనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇక పైన కూడా అమ్మ కాంటీనులు కొనసాగుతాయి అని తెలిపారు. కొనసాగటమేకాదు అందులో జయలలిత ఫొటోలు కూడా ఉంటాయి అని తెలిపారు. అలాగే కార్యకర్తలు చించివేసిన జయలలిత ఫోటోల స్థానంలో జయలలిత కొత్త ఫొటోలను ఎర్పాటు చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసారు. MK స్టాలిన్ కు తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Home »
» తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
No comments:
Post a Comment