చిలకలూరిపేటలో ఉద్రిక్తత - వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట - డౌన్ డౌన్ రజిని అంటూ పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించిన వైసీపీ శ్రేణులు
చిలకలూరిపేట పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కావటి మనోహర్ నాయుడును చిలకలూరిపేట ysrcp అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో పట్టణంలోని వైసీపీ శ్రేణులు స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికేతులలోకి టికెట్ ఇవ్వటంపై నిరసనగా ఈరోజు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీస్ వారు కార్యకర్తలను అడ్డుకోవడంతో వారి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఒకానొక సమయంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి లాఠీచార్జ్ జరిగే పరిస్థితి వచ్చింది. కానీ పోలీసు వారు సమయం పాటించి పరిస్థితిని అదుపులోకి తీసుకొని. చిలకలూరిపేట లో ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం మంత్రి విడుదల రజిని అని కార్యకర్తలు వాపోతున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇవ్వటం వలన పార్టీ పట్టును కోల్పోతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ విడదల రజిని అంటూ పట్టణ వీధుల్లో వైసిపి కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తులకు అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి రజిని ఉన్నారని కార్యకర్తలు తెలియజేశారు.
Follow
సమయం కోల్పోవటం కాదు. బాబు! "సంయమనం" కోల్పోవటం
ReplyDelete