చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ
చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సోమవారం నాడు కరోనా టెస్టులు చేపించుకుందాం అని చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళితే " సార్ ఈ రోజు సోమవారం టెస్టులు చెయ్యరు సార్ , మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మాత్రమే చేస్తారు " అని అక్కడి సిబంది చెప్పారు. అంటే మిగిలిన రోజులలో టెస్టులు చెయ్యరా అని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోజు సోషల్ మీడియాలో, వార్తలలో చిలకలూరిపేటలో ప్రతి రోజు 10 కేసులు, 15 కేసులు వచ్చాయి అని వార్తలు వస్తుంటే అసలు టెస్టులు చెయ్యకుండా కేసులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ,పేదవారు ప్రైవేట్ లాబ్స్ లలో టెస్టులు చేపించుకుందాం అంటే 3000 లేనిదే RTPCR టెస్టు లేదు, 3000 లేనిదే సిటీ స్కాన్ లేదు అని అసలే కరొన వల్ల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు కి అంత డబ్బులు కట్టలేక కరోనా లక్షణాలు ఉన్న కాని అలాగే జీవనం సాగిస్తున్నారు.
ఇప్పటికి అయినా ప్రతి రోజు టెస్టులు నిర్వహించాలి అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.