మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label చిలకలూరిపేట మండలం. Show all posts
Showing posts with label చిలకలూరిపేట మండలం. Show all posts

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- చిలకలూరిపేట మండలం పరిధిలోని లింగంగుంట్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం - ఇద్దరికి గాయాలయ్యాయ.

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు ప్రత్తి లోడుతో లారీ వస్తోంది.  లారీ డ్రైవర్ విశ్రాంతి తీసుకోవడంతో.... ఆ  సమయంలో క్లీనర్ డ్రైవ్ చేస్తూ ఉండగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకుతీవ్ర గాయాలు అయ్యాయి. ఇతనిది కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పాసపుల్ల గ్రామం. లారీ క్లీనర్ జమాల్ బాషాకు స్వల్పగాయాలయ్యాయి. ఇతనిది కడప జిల్లా జమ్మలమడుగు. తెల్లవారు జాము 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ సంఘటన జరిగింది.. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు.



Share:

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి  శానిటైజర్ తాగి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో బెల్లంకొండ వాసు అనే యువకుడు మార్కెట్ సెంటర్లోని మైదానంలో పూలు అమ్ముకుంటూ బాబుగారి తోటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. సదరు యువకుడు దీర్ఘకాళికా వ్యాధితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన ఆ యువకుడి భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టించుకునే వారు లేక సరిగ్గా ఇంటికి రాకుండా పూర్తిగా మద్యానికి బానిసై 21వ తారీఖున సాయంత్రం సమయంలో మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక శానిటైజర్ కొనుక్కొని తాగాడు. సదరు యువకుడు తీవ్ర అస్వస్తతకు గురి అవ్వటంతో అతనిని గుంటూరు GGH కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. 





































Share:

చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

నాదెండ్ల మండల గ్రామాలలో 6 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 5

కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

































Share:

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం ఆధ్వర్యంలో MLA విడదల రజిని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడదల గోపి, మునిసిపల్ చెర్మన్ రఫాని, యార్డ్ చెర్మన్ బొల్లెద్దు చిన్న ముఖ్య అతిధులుగా విచ్చేసి 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి చేసారు. కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న సమయంలో మునిసిపల్ సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి అని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.పట్టణంలో ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చిన చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం తరుపున తమ వంతు కృషి చేసాము, చేస్తూనే ఉంటాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. 











































Share:

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు   బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది. 
























































Share:

చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు

చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సొలస గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి 

గణపవరం గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 



































 

Share:

చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి

చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మండలంలోని కావూరి గ్రామంలో బుధవారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ కత్తి తో దాడి చేసేలా దారి తీసింది. వివరాలలోకి వెళ్తే కావూరు గ్రామంలో రామారావు, కందుల రమేష్ అనే వ్యక్తి వద్ద నుండిడబ్బులు తీసుకున్నాడు. చాలా రోజులుగా అడుగుతుండగా డబ్బులు ఇవ్వకపోవటంతో గొడవ ముదిరి ఇద్దరు బహ బాహికి దిగారు. ఇంతలో రమేష్ కత్తితో రామారావు పైనా దాడి చేసాడు. ఈ ఘర్షణలలో రామారావుకి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో రామారావును చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.  





































Share:

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - 2021-2022 విద్య సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ కు వచ్చేశాయి. మంగళవారం సాయంత్రం సమయంలో పాఠ్యపుస్తకాలు తీసుకొని APSRTC కార్గో వాహనం RVSCVS హైస్కూల్ కి చేరాయి. ఇక్కడ నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపినీ చేయనునంట్లు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ( MEO ) ఎల్. లక్ష్మి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ నాకు చేరుకున్నాయి. ఇక్కడ నుండి త్వరలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు రెండు సంవత్సరాలు చదువుకి దూరం అయ్యారు. ఈ సంవత్సరం అయిన కరోనా తగ్గి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉండాలి అని కోరుకుందాం. 

https://chilakaluripetspeednews.blogspot.com/





































Share:

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి...  -  ఇద్దరు నిందితులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు. 

 నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా  ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.

కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.   

































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. 

తూబాడు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో - 8

కనపర్రు గ్రామంలో - 1

ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 









































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు మొత్తం 10 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట మండల గ్రామంలో 9 కేసులు నమోదు అయ్యాయి. 

మురికిపూడి గ్రామంలో - 9 

మురికిపూడి గ్రామంలో రెండు కుటుంబాలలో ఈ తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. ఒక కుటుంబంలో 5 మరో కుటుంబంలో 4 గా నమోదు అయ్యాయి. 



చిలకలూరిపేట పట్టణంలో 1 కేసు నమోదు అయింది. 

సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యింది. 






























Share:

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - సినీ నటుడు శివాజీ చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామం అయిన గణపవరం నందు పీహెచ్సి నందు సోమవారం మధ్యాహ్నం నాడు వాక్సిన్ తీసుకున్నారు. వివరాలోకి వెళ్తే  శివాజీ స్వగ్రామం చిలకలూరిపేట నియోజకవర్గం అయిన నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామం అయితే గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహనా పెంచటం కోసం ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ తీసుకునట్లు అయన తెలిపారు. సోమవారం రోజున మూడు గంటల ప్రాంతంలో డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ కీర్తి మయూరి గారు శివాజీకి వ్యాక్సిన్ వేశారు. అనంతరం డాక్టర్ గోపీనాయక్ తో మాట్లాడి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి అని కరోనా నుండి ప్రాణాలతో బయటపడాలి వ్యాక్సిన్ ఒక్కటే మనకి ఆయుధం అని తెలిపారు. 





















































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

నాదెండ్ల మండల గ్రామాలలో 11 కేసులు నమోదు అయ్యాయి 

కనపర్రు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో - 8 గా నమోదు అయ్యాయి 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి 

మైదవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 








































Share:

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం నాడు సుప్రీం కోర్టు జెడ్జి లావు నాగేశ్వరావు గారు పర్యటించారు. పట్టణంలోని సుభాని నగర్ నందు ఉన్న లాహిరి పిల్లల హాస్పిటల్ నందు తేళ్ల సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన చిన్న వేడుకలలో అయన పాల్గొన్నారు. లావు నాగేశ్వరావు గారి స్వగ్రామం పెదనందిపాడు కావటంతో చిలకలూరిపేటతో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు.నాగేశ్వరావు గారి పర్యటనతో ఆ ప్రాంతం అంతా పోలీస్ బందోబస్తుతో నిండిపోయింది. 
























































































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు  నమోదు అయ్యాయి 

కొమరవల్లి పాడు లో - 2

మద్ది నగర్ లో -1

చిలకలూరిపేట మండల గ్రామాల ప్రాంతాలలో ఎటువటిని కేసులు నమోదు కాలేదు 























Share:

చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం

చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అమీన్ సాహేబుపాలెం ST కాలనిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను MLA విడదల రజిని పరామర్శించారు. MLA రజిని మాట్లాడుతూ ఇలాంటి అగ్ని ప్రమాద జరగటం చాల దురదృష్టకరం అని, ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి 5000 రూపాయల చొప్పున ఆరు కుటుంబాలకు 30,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంలో MLA తో పాటుగా గ్రామా పార్టీ అధ్యక్షుడు గుర్రం ఉపేంద్ర , మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రామా సర్పంచ్ కామినేని లలిత , కాట్రగడ్డ మస్తాన్ , వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు 

































 
Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 19-06-2021-శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 19-06-2021-శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 19-06-2021-శనివారం నాడు మొత్తం 33 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


యడ్లపాడు మండల గ్రామంలో 16 కేసులు నమోదు అయ్యాయి 

బోయపాలెం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 1

జగ్గాపురం గ్రామంలో - 1

సొలస గ్రామంలో - 4

తిమ్మాపురం గ్రామంలో - 1

ఉప్పరపాలెం గ్రామంలో - 8 గా నమోదు అయ్యాయి 



నాదెండ్ల మండల గ్రామాలలో 17 కేసులు నమోదు అయ్యాయి 

నాదెండ్ల గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో - 14

కనపర్రు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 















































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం  నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

యడ్లపాడు మండలంలో 6 కరోనా కేసులు నమోదు అయ్యాయి 

ఉప్పరపాలెం గ్రామంలో - 2

సొలస గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండలంలో 11 కేసులు నమోదు అయ్యాయి 

కనపర్రు గ్రామంలో - 2

సాతులూరు గ్రామంలో - 1

గణపవరం గ్రామంలో -  3

అప్పాపురం గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 































Share:

చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - పసుమర్రు గ్రామంలో ఇంట్లో మంచి నీటి కోసం అని మోటర్ స్విచ్ ఆన్ చెయ్యబోయి కరెంటు షాక్ తో వ్యక్తి మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే పసుమర్రు గ్రామంలోని తన్నీరు కొండలరావు (56) బుధవారం నాడు మంచి నేటి కోసం అని మోటర్ స్విచ్ వెయ్యటానికి వెళ్ళాడు. అదే సమయంలో మోటార్ కి సంబంధించిన హై వోల్టాజి వైర్లు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి వచ్చి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. దీనితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్యతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.  


































































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.