చిలకలూరిపేట - వాలంటీర్లు ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే డబ్బులలో కమిషన్ అడిగితే మమ్ములను సంప్రదించండి - ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట పట్టణంలో వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పధకాలు ద్వారా వచ్చే డబ్బులతో కొంత కమిషన్ ఇవ్వాలి అని అడుగుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది అని రఫాని తెలిపారు అలాంటి అక్రమాలకు పాల్పడే వారిని కమిష్నర్ దృష్టికి కానీ తన దృష్టికి కానీ తీసుకురావాలి అని రఫాని గారు తెలిపారు. అలాగే అలాంటి అక్రమాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. సీఎం జగన్ గారు ప్రవేశపెడుతున్న పధకాలు ఏవి అయినా ఒక్క రూపాయి కూడా ఎవరికీ చెలించాలిసిన అవసరం లేదు అని తెలిపారు. ఈ సమయంలో రఫాని గారితో పటు పట్టణ అధ్యక్షుడు తలహ ఖాన్ , మరియు దేవినేని శంకర్, కాట్రగడ్డ మస్తాన్ రావు గారు, గొంటు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.