జగనన్న తోడు అనే పధకం క్రింద ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు,చేతి వృత్తి కళాకారులకు 10 వేలరూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు వారి ఖాతా లో ప్రభుత్వం జమచేస్తుంది. ఈ పథకానికి అర్హులు అయి ఉండి పేర్లు నమోదు చేసుకొని వారు గ్రామ,వార్డు వాలంటీర్లను సంప్రదించండి. వారి ద్వారా సచివాలయాలలో దరఖాస్తు చేసుకోండి. 3 నెలలో పరిశీలించి రుణాలు అందిస్తారు. మరిన్ని వివరాలకు 08912890525, 1902 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.
జగనన్న తోడు పధకానికి వీరు మాత్రమే అర్హులు
* చేనేత, ఇత్తడి పని చేసేవారు.
* కొండపల్లి బొమ్మలు తయారు చేసే వారు, కలంకారీ , తోలుబొమ్మలు, కుమ్మరి , బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక , ఇతర చేతి వృత్తుల వారు
* తోపుడు బండ్ల పైన కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్ధాలు అమ్మేవారు
* గంపలలో, బుట్టలలో వస్తువులు అమ్మే వారు,
* సైకిళ్ళు, ఆటోలలో , బైకుల పై వ్యాపారం చేసుకునే వారు
* 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత, తాత్కలిక షాపులు ఉండేవారు
అర్హులు
No comments:
Post a Comment