కరోనా కబళిస్తున్న సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ ఓకేంత ఊరటనిచ్చినా , సామాన్యుల నడ్డి మాత్రం విరక్కొట్టటం తప్పేలా లేదు. లీటర్ 75 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఈ రోజు 102 రూపాయలు అంటే సుమారు 27 రూపాయల బాదుడు. అంటే వారానికి సుమారు 4 సార్లు పెట్రోల్ కొట్టించినా సుమారు 100 రూపాయలు ప్రతి సామాన్యుడి నుండి వసూళ్లు చేస్తున్నట్లు. ఈ బాదుడు కన్నా వ్యాక్సిన్ ధర డైరెక్ట్ గా మార్కెట్లోకి వదిలినా 1000 రూపాయలు అనుకుందాం. ఆ లెక్కన సామాన్యుడి జేబు చిల్లు పడుతున్న విషయం అర్ధం కావటం లేదు. ఫ్రీ సోర్స్ కి అలవాటుపడ్డ ప్రజలు వెనక జరుగుతున్నా పరిణామాల గురించి ఆలోచించటం లేదు.
ప్రైవేట్ హాస్పిటళ్ళకు 25% వ్యాక్సిన్ ఇవ్వాలి అని మోడీ గారి నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఉంది అసలు కధ చచ్చిన వారిపైన డబ్బులు ఏరుకునే ప్రైవేట్ వైద్యశాలల చేతిలో వ్యాక్సిన్ పెడితే బ్లాక్ మార్కెట్ దందా మాములుగా కొనసాగదు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రెమిడీసీవర్ అనే ఇంజక్షన్ 2000 ఉంటే వాటి అన్నిటిని హోల్డ్ చేసి బ్లాక్ మార్కెట్ లో 40000( నలబై వేలు ) కు అమ్ముకున్న దాఖలాలు కోకొల్లలు. అలాగే మంచి బ్రాండెడ్ వ్యాక్సీలకు రెక్కలొచ్చే టైం త్వరలోనే ఉంది.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కేవలం ఆయిల్ రేట్లు పెరిగినట్లు కాదు. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి , నిత్యావసరాల సరుకుల రవాణా పెరిగిపోయాయి, నిత్యావసరాల సరుకులకు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగురుతాయి. అప్పుడు సామాన్యుడు ఆకులూ అలమలు తిని బ్రతకాలి.
No comments:
Post a Comment