చిలకలూరిపేట - బియ్యం దొంగలు - తరలించడానికి సిద్ధంగా ఉన్న అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
చిలకలూరిపేట - చిలకలూరిపేట నుండి గణపవరం డొంక రోడ్డు నందు ఉన్న గోడౌన్ నందు అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం వివరాల్లోకి వెళ్తే
సివిల్ సప్లైస్ డిటి నాగమల్లేశ్వరరావు, గుంటూరు సివిల్ సప్లైస్ డిటి హూక్, విఆర్వో సాంబశివరావులకు అందిన సమాచారం మేరకు గణపవరం డొంక రోడ్డు నందు ఒక గోడౌన్ నందు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 308 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని 25 కేజీల బస్తాల చొప్పున మొత్తం సుమారు 1200 బస్తాలను సిద్ధం చేసినట్లుగా గుర్తించారు. వెంకటేశ్వర్ రెడ్డి, చిన్నబ్బాయి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని అని వారిపై కేసు నమోదు చేశారు.