అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి - ఎవరు ? ఎక్కడ !
కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 29 వార్డులకు గాను 14 టిడిపి 14 వైసిపి అభ్యర్థులు గెలిచి సమానంగా ఉన్నార. మిగిలిన ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అవటంతో ఏ పార్టీకి ఆమె మద్దతు ఇస్తే ఆ పార్టీ వారు అక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి 10 వార్డ్ కడిమికొండ శ్రీలక్ష్మి (టిడిపి రెబల్) ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే శ్రీలక్ష్మి టిడిపి రెబల్ అవ్వటంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.