కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా
చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసిపి తన హవా కొనసాగించింది. ఎలక్షన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ పై ఉన్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరవేశాయి అక్కడి వైసీపీ శ్రేణులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు మొత్తం 24 వార్డుల గాను ఒక వార్డు ఏకగ్రీవం అవగా 12 వార్డులలో వైసిపి అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇప్పటివరకు వైసిపి 13 అభ్యర్థులను గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. 2 టిడిపి అభ్యర్థులు గెలిచి ఉన్నారు. మిగిలిన వార్డుల్లో టిడిపి ఆదిక్యత చూపిస్తుంది.
No comments:
Post a Comment