చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ - తృటిలో తప్పిన ప్రమాదం
చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ.. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి తిరుపతి బయలుదేరిన కుటుంబం బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఉన్న స్పీడ్ రిసిస్టర్స్ వద్ద కారును స్లో చేయగా, వెనక నుండి వచ్చిన లారీ కారును ఢీ కొనడంతో కారు డివైడర్ పై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో కారు వెనుక భాగంతో పాటు ముందు భాగం కూడా ధ్వంసం అవ్వగా లోపలున్న ప్రయాణికులకు ప్రాణాలతో బయటపడ్డారు. కారు వేగం తగ్గడంతో ప్రమాద స్థాయి తక్కువగా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు.
No comments:
Post a Comment