చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...
చిలకలూరిపేట నియోజకవర్గ రూరల్ మండలం అయిన మురికిపూడి,గోపాలంవారిపాలెం గ్రామాల యందు ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్న సేవా సమర్పణ కార్యక్రమం లో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసరావు,రూరల్ మండల మైనార్టీఅధ్యక్షులు పోతవరం సుభాని, ఉపాధ్యక్షులు మద్దిరాల సుభాని, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాత్రం సాంబశివరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక విద్యా కేంద్రాలను కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షుడు డి పుల్లయ్య, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు నందిగామ రాజు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ,పొత్తూరి బ్రహ్మానందం, పట్టణ ఓబీసీ మోర్చా కార్యదర్శి జే రాయుడు తో పాటుగా అక్కడి స్కూలు టీచర్లు అందరూ నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.