చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న మూలంగా అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా తీవ్రతను తగ్గించాలి అని సూచించారు. ఇప్పటికే యడ్లపాడు మండలంలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉండగా కరోనా విస్తృతి పెరుగుతున్న రీత్యా మరో 4 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. యడ్లపాడు మండలం యడ్లపాడు గ్రామం, కొండవీడు, కొత్తపాలెం, లింగారావుపాలెం గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు గా ఇన్సిడెంట్ కమాండర్ తహసీల్దార్ జ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే వంకాయలపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం గ్రామాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. ఆయా గ్రామాలలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే అత్యవసరంగా బయటకు రావాలి అని తెలిపారు. ప్రజలందరు సహకరించాలి అని కోరారు. అలాగే కరోనా నియమాలు పాటించని వారిపైన ఖఠినమైన చర్యలు, కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.