చిలకలూరిపేట - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ
చిలకలూరిపేట:- బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చలంచర్ల నాగమ్మ(55) అనే మహిళ రెండు సంవత్సరాలుగా సొలస గ్రామం ఎస్టి కాలనీలో నివాసం ఉంటుంది. స్థానికుల సమాచారం మేరకు ఒంటరిగా జీవిస్తున్న ఆమె పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని, అందువలనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని వారు తెలిపారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని బావి నుండి బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.