త్వరలో జరగబోయే పల్నాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాను - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
పల్నాడు జిల్లా :- గత కొంతకాలంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపి టిడిపిలో చేరడం ఖరారు అయినా కూడా తేదీని ప్రకటించకపోవడంపై సందిగ్ధత నెలకొన్నది. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బిజెపికి ఇస్తారనే ప్రచారంతో అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వం వస్తుందో అనే ప్రచారానికి తెరపడింది. ఎంపీ ఆఫీస్ నుండి అఫీషియల్ గా త్వరలో జరగబోయే పలనాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి మరియు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ పలనాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను అని ఆ ప్రెస్ నోట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
No comments:
Post a Comment