ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అవిసాపాలెం కట్టు అంటే దేశ నలుమూలల నుండి ప్రత్యేకంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో కాళ్లు చేతులకు ఎముకలు ఏమి విరిగిన శస్త్రచికిత్సతో కాకుండా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు పొందినది పూనాటి కుటుంబం. అయితే ఆ కుటుంబం లో ఒకరైన వైద్య నిపుణులు పునాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందారు. అవిసాపాలెం కట్టు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతటి గుర్తింపు కలిగిన వీరి వద్దకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. 1900 సంవత్సరం నుండి పూనాటి వీరయ్య చౌదరి తదనంతరం వారి కుమారులు ఇప్పుడు వారి మనవళ్లు, ముని మనవాళ్ళు, వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. పూనాటి వెంకటేశ్వర్లు మృతి పట్ల గ్రామ పెద్దలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు.