చిలకలూరిపేట మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-యస్టీయూ ( స్టేట్ టీచర్స్ యూనియన్)
చిలకలూరిపేట పట్టణంలోని ని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంకై యస్టీయూ( స్టేట్ టీచర్స్ యూనియన్) నిరంతరం కృషి చేస్తుందని యస్టీయూ రాష్టృకమిటీ కన్వీనర్ పోటు.శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు రాష్టోృపాధ్యాయ సంఘం చిలకలూరిపేట పట్టణశాఖ సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పట్టణ అద్యక్షులు వినుకొండ అక్కయ్య, ప్రధాన కార్యదర్శి మేకల.కోటేశ్వరరావు, ఆర్ధికకార్యదర్శి కుంభా.ఏడుకొండలు ,ఈ.శామ్యూల్ పాల్గొన్నారు.గత75సంవత్సరాలుగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పై యస్టీయూ ఉద్యమకార్యాచరణ చేపట్టి అనేక సమస్యలను పరిష్కరించిందని నేడు ఉపాధ్యాయులు పొందుతున్న అన్ని సౌలభ్యాలు అనేకమంది ఉపాధ్యాయుల పోరాట ఫలితమేనన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ యస్టీయూ పట్ల చూపుతున్న ఆదరణే 75వసంతాలుగా సంఘం విరాజిల్లుతుందన్నారు. రాష్టృ ప్రభుత్వం 55% ఫిట్ మేంట్ తో పీఆర్సీ ప్రకటించాలని,ఉపాధ్యాయులకు నెల వారీ పదోన్నతులు కల్పించాలని,పెండింగ్ డీ,ఏ.లు విడుదల చేయాలన్నారు. మనబడి,నాడునేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ,ఎల్స్ మంజూరుచేయాలన్నారు.
No comments:
Post a Comment