భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ
చిలకలూరిపేట:- మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలోని టిడిపి శ్రేణులు సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మ తగలబెట్టి నరసరావుపేట సెంటర్లో భారీ మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ట ఈ కేసు. ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి శరత్ బాబుని అక్రమంగా ఈ కేసులో అరెస్టు చేశారు.
నారా చంద్రబాబు గారు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటలలోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని.. కుటుంబ సభ్యుల పైన కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నీవు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో.. నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు. నాలుగు సంవత్సరాల నుంచి మమ్ములను వేధించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి నిన్ను ప్రజా క్షేత్రం నుంచి తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయి.. అందుకే ఇటువంటి చేష్టకు నీవు పూనుకుంటున్నావు అంటూ ఆయన ద్వజమెత్తారు.
ప్రత్తిపాటి శరత్ బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలియజేసిన టిడిపి శ్రేణులు..
పత్తిపాటి నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేశారు. బైపాస్ పై నిరసన తెలియజేస్తూ డౌన్ డౌన్ సీఎం, నశించాలి నిరంకుశ పాలన డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపీ - జనసేనలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment