ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా నేరుగా కలవొచ్చు --- MLA రజని
చిలకలూరిపేట మున్సిపల్ తొలి సమావేశంలో చాలా సమస్యలపైనా చర్చించారు. అలాగే రోడ్లు , నీటి సమస్యల పైనా చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షలుగా రఫాని గారు, ఎక్స్ అఫీషియా సభ్యురాలి హోదా లో MLA రజని గారు పాల్గొన్నారు. రఫాని గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ వార్డు పైన పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని, వార్డు లో ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తెలుసుకురావాలి అని, పార్టీలకు అతీతంగా కలసి చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి పధంలో తెలుసుకు వెళ్లాలి అని అన్నారు. ఇప్పటికే మానుకొండవారిపాలెం కి 75 లక్షలు , పసుమర్రు కి 2 కోట్లు, గణపవరంకి 5 కోట్లు తో పరిశుద్ధ,త్రాగునీరు సమస్యల పరిష్కారానికి అంచనా వేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది అని చెప్పారు. పార్టీ ఏది అయినా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలి అని, చౌకబారు మాటలతో దిగజారుడు తనగా ఉండకూడదు అని, ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలి అని అన్నారు.
MLA రజని మాట్లాడుతూ వార్డు సమస్యలు ఏవైనా చైర్మెన్ గారికి లేదు అంటే తన దృష్టికి తెలుసుకురావాలి అని, ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం లేకపోతే వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు అని, ప్రజలు తమ సమస్యలని తీరుస్తారు అని మిమ్మల్ని ఎన్నుకున్నారు అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని, పాత బకాయిగా ఉన్న 82 కోట్ల రూపాయలని సిఎం జగన్ గారితో మాట్లాడటం జరిగింది అని ఆ భారం మన మున్సిపాల్టీ పైన పడకుండా తగు చర్యలు తీసుకుంటాం అని, కౌన్సిలర్లలో చాలా వరకు కొత్త వారు కనుక ఒక రోజు సభ్యుల హక్కులు, విధులు, సమస్యలని ఎలా ప్రస్తావించాలి, అనే అంశాల పైనా శిక్షణ ఇస్తారు అన్నారు.
అలాగే సభ్యులు తమ తమ వార్డులలో సమస్యలను చైర్మెన్ దృష్టికి తీసుకువచ్చారు.
No comments:
Post a Comment