చిలకలూరిపేట ఎక్క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా గంజాయి అమ్మేవారిని ప్రీ ప్లాన్డ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం గ్రామములో కోటేశ్వరరావు అనే వ్యక్తిని ఎక్క్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తికి సప్లై ఎక్కడనుండి వస్తుందో ఆరాతీసారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెకు చెందిన మస్తాన్ రావు అనే వ్యక్తి దగ్గిర నుండి గంజాయి వస్తుంది అని తెలుసుకొని కోటేశ్వరరావు నుండి మస్తాన్ రావు కి ఫోన్ చేపించి గంజాయి అయిపోయింది తీసుకురమ్మని చూపించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి 25kgల గంజాయి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో బొప్పూడి గుడి వద్ద అతనిని పట్టుకున్నారు.
ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి అని ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడేవాళ్ళ పైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. అలాగే ఎక్సైజ్ బ్యూరో CI కర్ణ , SI ప్రసాద్ గారిని మరియు సిబ్బందిని అభినందించారు.
No comments:
Post a Comment