కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ
సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అమరావతి మాత్రమే రాజధాని కాదు అంటూ మొత్తం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో అమరావతిలో వేల ఎకరాల భూములు దానం చేసిన రైతులు ఖంగు తిన్నారు. నాటి నుండి మొదలుకొని ఇప్పటికీ దీక్షలు చేస్తున్న - రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోగా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీక్ష చేస్తున్నారంటూ రైతులు చేసే దీక్షను పక్కదోవ పట్టిస్తున్నారని, న్యాయపోరాటానికి "న్యాయస్థానం టు దేవస్థానం" అనే నినాదంతో అమరావతి రైతులు పాదయాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా రేపు అనగా 6/11/2021 శనివారం నాడు పెదనందిపాడు చేరుకోనున్నారు. రేపు ఉదయం మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీ గా పెదనందిపాడు తరలిరావాలని - నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మరియు అమరావతి రైతుల మద్దతుదారులు ఈ పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి - 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని రైతులు గళాన్ని వినిపించాలి అని చిలకలూరిపేట టిడిపి పిలుపునిచ్చింది. నియోజకవర్గం పరిధిలోని వార్డు, మండల, జిల్లాస్థాయి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు-
ఇట్లు
తెలుగుదేశం పార్టీ
చిలకలూరిపేట నియోజకవర్గం.
No comments:
Post a Comment