చిలకలూరిపేట - గంజాయి తరలిస్తున్న యువకులకు రోడ్డు ప్రమాదం - కట్ చేస్తే ...... జైలుకి
చిలకలూరిపేట నియోజకవర్గం :- యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారి వద్ద ఇద్దరు యువకులు గంజాయి తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే శివ కుమార్, శంకర్ అనే ఇద్దరు యువకులు ఒరిస్సా నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా యడ్లపాడు వద్ద లారీలు చెక్ చేయడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అది గమనించిన యువకులు తమ ద్విచక్ర వాహనాలను దిశ మార్చి హడావిడిగా పారిపోవడానికి ప్రయత్నించి కింద పడ్డారు. ఇది గమనించిన పోలీసులు వారి బ్యాగులను చెక్ చేయగా అందులో 11 లక్షల విలువైన 107 కేజీల గంజాయిని గుర్తించారు. వెంటనే వారికి ప్రథమ చికిత్స అందించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనలో వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను మరియు 107 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దర్యాప్తులో భాగంగా చిలకలూరిపేట రూరల్ సిఐ పి శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల ఎస్సై బలరాం రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరో మూడు ద్విచక్ర వాహనాలు ద్వారా విజయవాడ మీద నుంచి హైదరాబాద్కి తరలించినట్లు వీరు ఇరువురి మాత్రం దారి తప్పటంవలన తమకు చిక్కారని వారిని కోర్టు ముందు పెడుతున్నట్లు, మిగిలిన ముగ్గురుని కూడా త్వరలోనే పట్టుకుంటామని వారు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం క్రింద లింక్ ని క్లిక్ చేయండి.
No comments:
Post a Comment