చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని వేలూరు రోడ్డులో ఉన్న ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చోరీలో 2.32 లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ సీఐ భాష చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఆ దుకాణానికి బాధ్యత వహిస్తున్న వ్యక్తి ఉద్యోగ భద్రతకై చోరీ జరిగిన మొత్తాన్ని చెల్లించాడు.
No comments:
Post a Comment