చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్
చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారి సమీపంలోని లక్కీ రోడ్ లైన్స్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళుతున్న ఇందు బస్ ట్రావెల్స్ తెల్లవారుజామున గం 4:15 ఈ సమయంలో జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనకు ముఖ్యకారణం డ్రైవర్ నిద్ర మత్తు వలన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన లో ఐదుగురికి స్వల్ప గాయాలు అవగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఒక హుటిన ఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందించి తీవ్రగాయాలైన చంద్రమోహన్, కటారి సురేష్ బాబులను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
No comments:
Post a Comment