తగ్గేదే లే ! బిల్లులో సమగ్రమైన మార్పులు చేసి మళ్లీ తీసుకొని వస్తాము - అమరావతి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉంది - సీఎం జగన్
మధ్యాహ్నం నుండి మూడు రాజధానుల విషయమై రాష్ట్రం మొత్తం చర్చలకు దారి తీసింది - వాటన్నిటికీ తెరదించుతూ ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ భేదాలు, న్యాయపరమైన చిక్కులు, ఆందోళనలను... దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన విచారణలను సేకరించి అందరి ఆమోదయోగ్యం తో బిల్లులను మార్పు చేసి మళ్లీ తీసుకువస్తామని సీఎం తెలిపారు. ఈ సభలో అమరావతి ప్రజల పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని... కానీ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మూడు రాజధానులు అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చినట్లు తెలిపారు.
No comments:
Post a Comment