చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్
చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో ఉన్న కరోనా కోరంటైన్ నందు పట్టణములోని భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు ఫ్రూట్స్ అందించారు ట్రస్ట్ సభ్యులు. కోరంటైన్ నందు భోజన సదుపాయాలు , మంచినీటి వసతి ఉన్న రోగులు త్వరగా కోలుకోవడానికి ఫ్రూట్స్ అందజేశారు. మందులతో పటు నాచురల్ ఫ్రూట్స్ వలన కలిగే లాభాలని తెలియజేసి వాటిని కరోనా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వడాల భాస్కర్ , కందుల రవి, వంశీ, సాయి మురారి, నాయుడు ఫణి, కీర్తి సాయి, గుడిపల్లి యశ్వంత్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment