చిలకలూరిపేట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు శనివారం మధ్యాన్నం 3 గంటల సమయం లో రజక కాలనీ నందు ఉన్న ఆరోగ్య కేంద్రం నందు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకొని జిల్లా వైద్య అధికారులతో మాట్లాడారు. 240 వ్యాక్సిన్లు కేటాయిస్తే 50 మందికి మాత్రమే వేశారు. 190 వ్యాక్సిన్లు మిగిలాయి వాటిని కూడా అర్హులకు ఉపయోగించాలి అని . వాలటరీలు స్లిప్స్ ఇచ్చిన తరువాత వ్యాక్సిన్ కోసం అని ఇక్కడికి వస్తే 84 రోజులు గడిచాకే సెకండ్ డోస్ వేస్తాం అని చెప్పటంతో వాళ్ళు వెనుతిగారు అని ఇలా ప్రజలను అనవసరంగా వ్యాక్సిన్ సెంటలకు తిప్పటం పట్ల జిల్లా వైద్య అధికారుల పని తీరు పైనా ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికీ కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారు అని తెలిపారు. అలాగే కొన్ని వ్యాక్సిన్ సెంటర్లలో 2000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అని వాటిపైన ద్రుష్టి పెట్టాలి అని తెలియజేసారు .
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
» చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం
చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం
చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment