అసలే కరోనా లాక్ డౌన్తో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైనది. ప్రభుత్వం ఇచ్చే పధకాలకు ఆధార కార్డులోని మార్పులు,మొబైల్ నెంబర్ లింక్ వంటి మార్పులకు మధ్యతరగతి ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
అయితే పొద్దున్న 6గంటల నుండి ఆధార్ కేంద్రాల వద్ద జనం క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. లాక్ డౌన్ వలన 12 గంటల వరకు అనుమతి, మధ్యాహ్నం అదిరిపోయే ఎండలు వలన ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు ఆధార్ కేంధ్రాల పెంపు చేపడితే మాత్రం కొంతవరకు ఈ హడావిడి తగ్గించవచ్చు.
అయినా మధ్యతరగతి బాధలు ఎవరికీ పట్టవు 3 రోజుల నుండి చూస్తున్నాను ఇంత వరకు మొబైల్ నెంబర్ లింక్ చేపించుకోలేకపోయాయని అని ఒకతని తెలిపారు. కరోనా ని కూడా లెక్కచెయ్యకుండా క్యూ లైన్లో సోషల్ డిస్టెన్స్ లేకుండా నుంచుంటున్నారు.
No comments:
Post a Comment