చిలకలూరిపేట - పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం నందు 31-05-2021 సోమవారం నాడు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాల పైనా చర్చించారు. అయితే సమావేశం మొదలు అవ్వగానే ముందుగా కరోనా వలన మృతి చెందిన పట్టణ ప్రజలకు సంతాపం తెలిపారు. వారి కోసం కొంచంసేపు మౌనం పాటించారు.
మునిసిపల్ ఛైర్మెన్ రఫాని అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యంశాలు
* తడి పొడి చెత్త సేకరణ, వినియోగదారుల పైనా యూజర్ చార్జీల అమలు విధానం , రాష్ట్ర మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. దేని పైనా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర పూర్తి అవగాహనా కల్పించేలా చర్చలు
* కరోనా మృతుదేహాల తరలింపుకు ఎర్పాటు చేసిన రెండు వాహనాల కేటాయింపు అయిన రెండు 2 లక్షల ఖర్చు పైన కౌన్సిల్ ఆమోదం
* గణపవరంలో శానిటైజేషన్ ప్రక్రియ చెయ్యాలి అని తెలిపారు. కమిష్నర్ రవీద్రగారు దీని పైనా ఇప్పటి వరకు 25 లక్షలతో త్రాగు నీరు ఇబ్బందులు లేకుండా చేసాం అని. విలీన గ్రామాల విషయం కోర్టులో ఉండటం వలన కోర్టు పెర్మిషన్ తో ఇతర అభివృద్ధి పనులు చేస్తాం అని తెలిపారు .
* అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక భవనానికి 12.43 లక్షల తో నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి .
* 8వ వార్డు నందు చేతి పంపు మరమ్మతులు జరగాలి అని ఆ వార్డు కౌన్సిల్ తెలిపారు.
మిగిలిన ముఖ్య సమాచారం తరువాత పార్ట్ నందు
No comments:
Post a Comment