చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 2
కౌన్సిల్ సమావేశం లోని ముఖ్యంశాలు 2 వ పార్ట్
* చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పు అంశం మళ్లీ ఒకసారి పరిశీలించాలి అని కొత్త కుమారి,శివ కుమారి గారు కోరారు. రఫాని గారు ఈ అంశం పైనా మళ్లీ చర్చించుకుందాం అని తెలిపారు.
* 37వ వార్డ్ కౌన్సిలర్ శివ కుమారి గారు మాట్లాడుతూ మంచినీటి చెరువుకు ఫెన్సింగ్ వేపించాలి అని తెలిపారు. చెరువులో చేపలు పట్టటం, స్నానం చెయ్యటం చేస్తున్నారు, అలాగే జంతువులు గేదెలు అందులో దిగితున్నట్లు తెలిపారు.
* 100% వ్యాక్సిన్ ప్రక్రియ జరగాలి అని చర్చించారు
* రాబోయే కాలంలో పట్టణ శివార్లు అయిన జాలయ్య కాలనీ, AMG వెనుక, భావనారుషి నగర్, పసుమర్రు నందు గార్బజి కలక్టర్ ( చేత పోగు చేసే పాయింట్స్ ) ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అక్కడి నుండి జిందాల్ కంపెనీ కి పంపుతున్నట్లు తెలిపారు.
* పండరీపురం కందిమళ్ల రెండవ గేట్ నందు పైప్ లీకేజీ, వాటర్ రంగు మార్పుల పైనా చర్చించారు.
* రోడ్లు, డ్రైనేజీలు, శానిటైజేషన్, కొన్ని ప్రాంతాలలో పందుల వలన సమస్యలు, త్రాగునీరు, పారిశుద్యం [పైన చర్చించారు.
* అమృత్ స్కీమ్ పధకం కోసం 30 కోట్ల రూపాయల బ్యాంకు లోన్ కి వెళ్ళాం అని. వాటి వలన త్రాగు నీరు సమస్య ఉండదు అని తెలిపారు.
* త్రాగు నీరు, శానిటైజేషన్ , పారిశుద్యం కొరకు బడ్జెట్ నందు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
* పట్టణంలోని అన్ని బోరుబావుల మరమ్మతులు, ప్రధాన కాల్వలలోని పూడిక తదితర అంశాలపైనా చర్చించారు.
No comments:
Post a Comment