చిలకలూరిపేట కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు తనిఖీ చేశారు. హాస్పిటల్ గదులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల శుభ్రతను పరిశీలించి దిశా నిర్దేశం చేసారు. అలాగే కరోనా వార్డు నందు బెడ్లు పెంపు నాకు లేఖ జిల్లా అధికారులకు రాసారు. అలాగే త్వరలో రెమిడీసివెర్ ఇంజక్షన్,ఆక్సిజన్ సీలిండర్ల పైనా ద్రుష్టి పెట్టారు.హాస్పటల్ నందు అత్యవసర గా కొంత మంది డాక్టర్లను, నర్స్ లను తీసుకోవాలి అని ప్రధాన వైద్యురాలిని కోరారు. అలాగే కొత్తగా తీసుకున్న వారికీ గవర్నమెంట్ జాబులకు రెఫరెన్సు సిఫారసు చేస్తాము అని తెలిపారు. దాతలు ఎవరైనా హాస్పిటల్ నాకు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు.
ఎంపీ పిలిపు మేరకు హాస్పిటల్ నందు నాయుడు రమేష్ గారు మరుగుదొడ్లు నందు పైపులను మరమ్మతు చేపించారు, హాస్పిటల్ గదుల నందు కొత్త ఫ్యాను లను ఎర్పాటు చేసారు. అలాగే గురువారం నాడు అసిస్ట్ సంస్థ నుండి కరోనా రోగులకు ఆక్సిజన్ మాస్కులు, గన్ మీటర్లు, పేస్ షీల్డులు , డాక్టర్లకు,సిబ్బందికి పి పి ఏ కిట్లను అందజేశారు . అలాగే సింగపూర్ నందు ఉంటున్న బైరా స్వర్ణలత గారు 20 ఆక్సిజన్ సీలిండర్లను అందజేశారు. అలాగే కరోనా వార్డులలో ఉన్న 20 బెడ్లను 30 కి పెంచారు. మరో రెండు రోజులలో మరిన్ని సౌకర్యాలను అందజేస్తాం అని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు వైస్సార్సీపీ ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment