చిలకలూరిపేట కరోనా మొదటి వేవ్ నందు గ్రామాల ప్రజలు తపించుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదలటం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామాలలో మాత్రం ఈసారి ఏ పల్లెటూరుని కూడా వదలటం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం గా వ్యవహరించినా అసలు కనికరం చూపటంలేదు. ముఖ్యంగా యడ్లపాడు, పసుమర్రు ఏరియాలలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తుంది. గ్రామాలలోని ప్రజలు కొన్ని రోజులపాటు 10 రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకొని బయటకు రాకుండా ఉంటే పట్టణంలో కన్నా గ్రామాలలో త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. దయచేసి గ్రామాలలో ఉన్న యువకులు ముందుకి వచ్చి ఈ కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ తమ తమ గ్రామాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి ఊరులోని వ్యక్తులు బయట జాబ్ చేసుకునే వాళ్ళ నుండి కరోనా విపత్తు వివరించి చందాలు పోగుచేసి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళని ఇళ్లలో నుండి బయటకి రావద్దు అని చెప్పి వారికీ ఆహార సదుపాయాలు చూసుకుంటే కొన్ని రోజులలోనే కరోనా విపత్తు నుండి బయటపడవచ్చు. గ్రామపెద్దలు సహకారంతో యువకులు ముందుకు వచ్చి నిలబడాలి అని కోరుకుంటున్నాము. ఎంతో మంది డబ్బు ఉన్నవారు కరొనతో చనిపోయినవారు ఉన్నారు కానీ అక్కడ డబ్బు ఉపయోగపడలేదు. మనుషులు మాత్రమే ముఖ్యం. యువకులు తలుచుకుంటే ఏది అయిన చెయ్యవచ్చు. మన గ్రామాలను అందులోని మనుషులను కాపాడుకుందాం. కరోనా తతీవ్రత తగ్గినప్పటి నుండి గ్రామాలలో వ్యాక్సిన్ ప్రక్రియకు కూడా మీ సహకారం అందించి గ్రామ సుభిక్షతకు తోడ్పడండి.
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
,
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
No comments:
Post a Comment