చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్
చిలకలూరిపేట:- పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట వైయస్ఆర్సిపి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మరియు పార్టీలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చిలకలూరిపేటలో వైఎస్ఆర్సిపి కేడర్ చాలా బలంగా ఉంటుందని. చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోయి పార్టీ గెలుపుకి కృషి చేద్దామని. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు గెలుపుకై కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 45 రోజులు కార్యకర్తలు సమయమును పాటిస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో ఉన్న ఏడికి ఏడు ఎమ్మెల్యేలను ఒక ఎంపీ స్థానాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి కి మనం అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడి తాను రెండుసార్లు ఎమ్మెల్యేని అయ్యానని ఒకసారి మంత్రిగా కూడా పని చేశానని కష్టం విలువ తనకు తెలుసునని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని అదే వైఎస్ఆర్సిపి ముఖ్య అజెండా అని ఆయన తెలిపారు.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
No comments:
Post a Comment