నేడే దాయాదుల పోరు - విజయం ఎవరిని వరించనుంది ?
ప్రపంచం మొత్తం ఆ రెండు దేశాల మధ్య ఏం జరిగినా పెద్ద న్యూస్ మరియు వింతలా చెప్పుకుంటారు. అలాంటిది గత కొంత కాలంగా ఆ రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొని చివరకు క్రీడలు ఆడుకోవడానికి కూడా సుముఖంగా లేని ఆ దాయాది దేశాలు నేడు మహా సంగ్రామంలో పాల్గొన్న పోతున్నాయి. ఇంతకీ ఆ రెండు దేశాలు ఏంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దాయాది దేశాలు అయినా ఇండియా పాకిస్తాన్ మధ్య నేడు 2021 టి20 వరల్డ్ కప్ ఆడబోతున్నాయి. దీంతో ఆ రెండు దేశాలు కాకా యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయిదు సార్లు ప్రపంచకప్లో పాల్గొనగా ఐదుసార్లు భారత్ విజయం సాధించింది. అయితే నేడు జరిగే మ్యాచ్ భారత్ జట్టు తో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఫామ్ లో ఉన్నారు. నేడు సాయంత్రం 7:30 నిమిషాలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నందు ఈ మ్యాచ్ జరగనుంది.
No comments:
Post a Comment