చిలకలూరిపేట - ఘోర రోడ్డు ప్రమాదం - కూలీలతో ఉన్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చిలకలూరిపేట :- చిలకలూరిపేట - నరసరావుపేట మధ్య కావూరు చెక్పోస్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా , పదిమందికి పైగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు వేలూరు గ్రామానికి చెందిన కూలీలు పొలం పనుల నిమిత్తం ఆటోతో బయలుదేరగా కావూరు, లింగంగుంట్ల మధ్య ఉన్న చెక్ పోస్ట్ వద్ద మాచర్ల నుంచి చిలకలూరిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పాటు బస్సు ముందు భాగం ఆటో పైకి ఎక్కి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పదిమందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడి చేరుకున్న చిలకలూరిపేట రూరల్ ఎస్సై క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment