బొప్పూడి రైతులకు సంబంధించిన భూముల విషయం లో హైకోర్టు చిలకలూరిపేట తహసీల్దార్ గారు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి అని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ వాటిని ఉల్లంగిస్తూ రైతులపైన తహసీల్దారు గారు పోలీసులకి ఫిర్యాదు చేసారు. .చిలకలూరిపేట రురల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రైతులపైనా కేసు నమోదు అయినందువలన , సి సుబ్బాయమ్మ అనే మహిళా రైతు హైకోర్టు నందు తహశీల్ధార్ సుజాత గారి పైన కోర్టు ధిక్కరణ కేసు వేశారు.
ఈ సందర్భంగా నవతరం పార్టీ జాతీయ అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతు బొప్పూడి, రాజాపేట, మురికిపూడి, రైతులకు మద్దతుగా ఉంటాను అని, ధిక్కరణ కేసు కాపీ ని ముఖ్యమంత్రికి, గవర్నర్, మైనింగ్ శాఖ మంత్రులకి రైతులతో కలిసి అందచేస్తాం అని పేదలకి అండగా వుంటాను అని తెలిపారు.
No comments:
Post a Comment