నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...
1. విజయనగరం లోక్సభ - అప్పలనాయుడు,
2. ఒంగోలు లోక్సభ - మాగుంట శ్రీనివాసులరెడ్డి,
3. అనంతపురం లోక్సభ - అంబికా లక్ష్మినారాయణ,
4. కడప లోక్సభ- చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేర్లు ప్రకటన..
1. చీపురుపల్లి అసెంబ్లీ - కళా వెంకట్రావు,
2. భీమిలి - గంటా శ్రీనివాసరావు,
3. పాడేరు - వెంకటరమేష్ నాయుడు,
4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి,
5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం,
6. ఆలూరు - వీరభద్ర గౌడ్,
7. గుంతకల్లు - గుమ్మనూరు జయరాం,
8. అనంతపురం అర్బన్ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్,
9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్ పేర్లను ప్రకటించిన టీడీపీ
మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.
ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం..
No comments:
Post a Comment