చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్
చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిపై రగడ నడుస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు నేడు మంగళగిరిలోని టిడిపి ఆఫీసు నందు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరటం ఖరారు అయినట్టు సమాచారం. ఇప్పటికే సన్నిహితులతో పాటు కార్యకర్తలతో టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రాజేష్ నాయుడుని వైసీపీ పార్టీలో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. తనతో పాటు 18 మంది వైసిపి వార్డు మెంబర్ల టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాబోవు ఎన్నికలకు టిడిపి గెలుపు పై కాకుండా మెజారిటీపై చర్చలు జరుపుకుంటున్నారు.
Follow below
No comments:
Post a Comment