నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు
గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టిడిపి లో చేరారు. కొన్ని రోజులుగా వైసిపి పార్టీలో చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటినుండి తీవ్ర సంతృప్తిలో ఉన్న రాజేష్ నాయుడు నేడు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. అతనితోపాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టిడిపి పార్టీలో చేరారు. మంత్రి విడదల రజిని నుండి ఆర్థికపరమైన విషయాలలో తేడా రావటం వలన చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త తొలగించినట్లు అప్పట్లో పట్టణమంతా మారుమోగింది. చిలకలూరిపేటలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంతో పట్టణంలోని కొంతమంది YSRCP కౌన్సిల్ మెంబర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు రాజేష్ నాయుడుతో పాటు తో పాటు వైసీపీ వ్యతిరేక కౌన్సిలర్లు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
Follow below
https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY
No comments:
Post a Comment