చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు
27-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలోని బంగారపుకొట్లు బజార్ (షరాఫ్ బజార్ ) నందు ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి చిన్నరధం తిరునాళ్ల నిర్వహించారు. కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా ఎవ్వరిని ఆహ్వానించకుండా పరిమితి సంఖ్యలో (20 మంది) తో కార్యక్రమాన్ని నిర్వహించారు. 23-04-2021 నుండి ఆలయ నిర్వాహకులు, అర్చకుల సమక్షంలో కళ్యాణోత్స్వమ్ నిర్వహిస్తూ రథం తిరునాళ్లతో కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా రథాన్ని 20 అడుగులు ముందుకు కదిలించి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
VIdeo:-
No comments:
Post a Comment