దమ్ముంటే విడదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేయమనండి - మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెడతాను - మల్లెల రాజేష్ నాయుడు
చిలకలూరిపేట :- నియోజకవర్గంలోని రాజకీయం వేడెక్కింది. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ నందు ఆయన తన ఆవేదనను వెలగక్కారు. 2019 నుండి పార్టీకి కొమ్ము కాసి పనిచేస్తున్న వైసిపి కుటుంబ సభ్యులను అన్యాయం చేస్తున్నారని.. నాడు మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానంటే తాము అందరం కష్టపడి పని చేశామని. పార్టీ గెలిచిన తర్వాత మంత్రి రజిని వల్ల మర్రి రాజశేఖర్ కు మొండి చేయి మిగిలిందని. కార్యకర్తలందరం వరుసలు పెట్టి పిలుచుకునేంత సన్నిహితంగా ఉంటామని కానీ ఈరోజు ఎక్కడో గుంటూరు విజయవాడ నుండి వ్యక్తులను తీసుకొచ్చి చిలకలూరిపేట నియోజకవర్గంలో నిలబెడతామంటే తాము ఒప్పుకోమని ఆయన తెలిపారు. పార్టీ నాకు కాకపోయినా చిలకలూరిపేటలో ఉండే బలమైన వ్యక్తికి టికెట్ ఇస్తే తాము అందరం కలిసి గెలిచి చూపిస్తామని ఆయన తెలిపారు. మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇస్తే తన తరఫునుంచి 20 కోట్ల రూపాయలు పార్టీకి ఖర్చు పెడతానని ఆయన తెలియజేశారు. కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు నుండి దమ్ముంటే విడుదల రజిని చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన సవాలు విసిరారు. తనకు రజిని వద్ద నుండి 6 కోట్ల రూపాయలు డబ్బు రావాల్సి ఉంటే దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి తో మాట్లాడితే డబ్బులు ఇస్తుందో ఇవ్వదో వదిలేసేయ్ అని అన్నారని వాపోయారు.
Follow
No comments:
Post a Comment