చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు
చిలకలూరిపేట :- చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడుని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. ఇవాళ ఉదయం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో గందరగోళం నెలకొన్నది. పార్టీలోని ముఖ్య నేతలు అంతా చర్చించుకుని లోకల్ లో బలమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానాన్ని కోరారు. అయినప్పటికీ గుంటూరు మేయర్ గా పనిచేస్తున్నటువంటి కావటి మనోహర్ నాయుడుని చిలకలూరిపేట అభ్యర్థిగా ఖరారు చేశారు. స్థానిక వ్యక్తులను కాకుండా బయట వారికి అవకాశం ఇస్తే 30 మంది వైసిపి కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మనోహర్ నాయుడు గుంటూరులోనే ఉన్న విడదల రజిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Follow
No comments:
Post a Comment