చిలకలూరిపేట వైఎస్సార్సీపీ కేడర్లో గందరగోళం
చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి పార్టీలో రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఇప్పటికే చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు పోటీపై భిన్నభిప్రాయాలు చర్చిలు జరుగుతూ ఉండటం దీనికి కారణం. సమన్వయకర్తగా రాజేష్ నాయుడు పేరు ప్రకటించినప్పటి నుండి కూడా వారానికి 10 రోజులకు ఒకసారి పోటీ చేసే వ్యక్తిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పుకార్లను షికారులుగా చేసేది ప్రత్యథి పార్టీ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో... సొంత పార్టీలోని నేతలు, క్యాడర్ పోటీ చేసే వ్యక్తి మారుతారని మొదటి నుంచి ప్రచారం చేయడంతో 2019 ఎలక్షన్ తర్వాత బలంగా ఉన్న క్యాడర్ ఏ వర్గం వైపు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. తాజాగా నేడు వైయస్ఆర్సీపీ 14 ఆవిర్భావ వేడుకలలో సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంసంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్తవారు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటాను" అని ఎలాగైనా సరే వైసిపి తరఫున తాను పోటీ చేసి తీరుతానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో టికెట్ ఖరారు పై ఇంకా స్పష్టత రాలేదని పోటీ చేసే అభ్యర్థిని మారుస్తున్నారని ఉదయం నుంచి ఈ వార్త ధారాళంగా పట్టణ ప్రధాన సెంటర్లలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం అంబటి రాంబాబు తీసుకువస్తారని ఇప్పుడు తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నీ చిలకలూరిపేట వైపు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బోగొట్ట. ఏది ఏమైనా ఈ పరిణామాలతో వైసిపి కేడర్ గందరగోళం లో పడిందని చర్చించుకుంటున్నారు. మర్రి రాజశేఖర్, జాన్ సైదా, మల్లెల రాజేష్ నాయుడు కొంతమంది బలమైన లీడర్స్ ఉండగా బయట నుండి వ్యక్తులను తీసుకురావడం సబబేనా అని పార్టీలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Follow this link to join my WhatsApp group:
Jagangaru survey chesi rajani garini marchi oka manchipanichesi.rajeshnu marchi seat kolpothunnadu.punaralochana cheyandi
ReplyDelete