చిలకలూరిపేట - కరెంట్ షాక్ తో బాలుడు మృతి
చిలకలూరిపేట :- డైక్మెన్ కాలనీకి చెందిన భవాని అనే బాలుడు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే మార్టూరు సీతయ్య కుమారుడు భవాని (11) వేద స్కూల్ నందు నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి సమీపము నందు కరెంట్ ఆఫీస్ రోడ్డు లో నిర్మాణంలో ఉన్న ఇంటి డాబాపై ఆడుకుంటుండగా పక్కనే ఉన్న కరెంటు లైన్ వైర్లు తగిలి విద్యుత్ ఖాతానికి గురయ్యాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడ్డ భవానీని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆసుపత్రి సిబ్బంది కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తెల్లవారుజామున మృతి మృతి చెందాడు. ఈ ఘటనతో కాలనీవాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అధికారులు కరెంటు వైర్లకు ప్లాస్టిక్ పైపులు వేసి తగిన చర్యలు తీసుకుంటే నిండు ప్రాణం బలి అయ్యి ఉండేది కాదని వారి ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment