మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆదాయం ఎంతంటే ?
పల్నాడు జిల్లా :- గడిచిన మహాశివరాత్రి రోజున లక్షలాదిమంది భక్తులు కోటప్పకొండకు చేరుకొని ఆ త్రికోటేశ్వరునికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి రోజున తెల్లవారుజాము నుండి భక్తులు మూలవిరాట్ దర్శనానికై కిలోమీటర్ల మేర బారులు తిరిగి దర్శనం చేసుకున్నారు. అలాగే కోటప్పకొండకు కాలినడకన వెళ్లిన భక్తులకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ప్రతిదీ. చాలామంది భక్తులు జనసంద్రోహాన్ని దాటుకొని ఆ దక్షిణామూర్తి దర్శనాన్ని చేసుకోలేని వారు కూడా ఉన్నారు. అయినా కూడా శివరాత్రి రోజున 1కోటి 63 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చిన హుండీ ఆదాయాన్ని శనివారం నాడు లెక్కించినట్లు ఆయన తెలిపారు. ప్రసాదాల ద్వారా 3,592,950రూ||, పూజా సామాగ్రి అమ్మడం ద్వారా 5,499,638 రూ||, మిగిలిన 7,255,639రూ|| హూండీల ద్వారా వచ్చినట్లు ఆయన తెలిపారు.
మరిన్ని వార్తలను వేగంగా పొందడం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
No comments:
Post a Comment