చిలకలూరిపేట - కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లి వస్తు - ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి విషమం
చిలకలూరిపేట :- నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు నేషనల్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే భద్రాచలానికి చెందిన ఒక క్యాటరింగ్ బృందం కోటప్పకొండ తిరునాళ్ళకి వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఎడ్లపాడు సమీపంలో నేషనల్ హైవే డివైడర్ కు తగిలి బొలెరో బోల్తా పడింది. దీంతో వాహనం వెనుక తలుపులు తెరుచుకొని వాహనంలో ప్రయాణిస్తున్న బుజ్జి అనే మహిళ రోడ్డు మీద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మిగిలిన ముగ్గురు(తులసి, లక్ష్మి, చిన్నమ్మాయి) మహిళలు పాటుగా ఉన్న డ్రైవరు, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణం వల్ల ఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న అంబులెన్స్ గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:
No comments:
Post a Comment