చిలకలూరిపేటకు ప్రధాని నరేంద్ర మోడీ ! ఎప్పుడు వస్తున్నారు అంటే ?
చిలకలూరిపేట :- ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకొక మలుపులు తీసుకుంటుంది. ఇప్పటికే పార్టీలలో ముఖ్య నేతలు తమకు సీటు దక్కపోవటంతో మరో పార్టీలోకి జంపింగ్లు జరిగిపోయాయి. మరికొందరు టిడిపి - జనసేన - బిజెపి పొత్తు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో టికెట్ దక్కకపోతే బిజెపి పోటీ చేసి గెలవాలని ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పొత్తు ఉంటుందని తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు బిజెపితో పొత్తు ఫిక్సయినట్లు టిడిపి ముఖ్య నేతలకు సమాచారం అందించారు దానితోపాటు ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నట్లు టిడిపి నేతలకు చంద్రబాబు తెలియజేశారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అందుకోసం అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈనెల 17న చిలకలూరిపేటలో జరగబోయే అతిపెద్ద భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. బిజెపి జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీక్రెట్ కేటాయించినట్లు. టిడిపికి 145 ఎమ్మెల్యే, 17 ఎంపీ పోత్తులో భాగంగా టిడిపికి దక్కినట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment