కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి - నేలకొరిగిన యడవల్లి ప్రభ
పల్నాడు జిల్లా :- 2024 కోటప్పకొండ తిరునాళ్ల కోలాహలం రంగ రంగ వైభవంగా జరిగింది. తిరుణాల ముగించుకొని వస్తున్న సమయంలో ఈటీ వద్ద యడవల్లికి చెందిన తెలుగు యువత ప్రభ నేలకొరిగింది. ఈ ఘటనలో రెండు ట్రాక్టర్లు ధ్వంసం అవ్వగా... ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన వ్యక్తిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.
అంగరంగ వైభవంగా కోటప్పకొండ తిరణాలను ముగించుకొని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ప్రభలు నిర్వాహకులు తమ సాయశక్తుల ఎటువంటి అపశృతి జరగకుండా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని కొన్ని సమయంలో చిన్నచిన్న అపశృతులు జరగటం మామూలే అయినప్పటికీ అంత భారీ ఖర్చులతో భారీ ప్రభలను నిర్మించి ఇలాంటి అపసృతులు జరగటం నిర్వాహకులకు కలవర పెడుతుంటాయి.
Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g
No comments:
Post a Comment